అరటి పండును తినడం వల్ల కలిగె ప్రయోజనాలు

ఎంతో మంది రోగులకు, బలహీనులకు, వెంటనే శక్తి రావడానికి దీనినే ప్రధాన ఆహారంగా సూచిస్తారు పెద్దలు,వైద్య నిపుణులు.దీనిలో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం,విటమిన్స్ చాలా అధికంగ వుంటాయి. అందుకే దీనికే మొదటి ప్రయారిటీ ఇస్తారు అందరూ.ఇకపోతే దీని రోజు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను మన జీవితంలోకి రాకుండా చేసుకోవచ్చు. అవేంటో ఒక సారి చూద్దాం.
1.మలబద్దకం, దీనిలో ఫైబర్ మల బద్దకాన్ని దరి చేరనివ్వదు.
2.దీనిలోని పోటాషియం , మినరల్స్ ఎముకలను గట్టిగా చేయటమే కాకుండా మనలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.
3.అరటిపండులోని పోటాషియం ఎక్కువగా ,సోడియం తక్కువగా దొరకటం వల్ల మన బ్లడ్ ప్రెజర్ని తగ్గించడమే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ లను తగ్గిస్తుంది.
4.జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
5.దీనిలో వుండే ఐరన్ , అనీమియాను దూరం చేస్తుంది.
6.ఇది మనలోని గ్యాస్ట్రిక్ జ్యూస్లను తొలగించి,ఎసిడిటీ,అల్సరు బారి నుండి కాపాడుతుంది.
7.దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా దొరకటం వల్ల కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
8.గుండె సంబధిత వ్యాధులనూ దూరం చేస్తుంది.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు